Responsive Header with Date and Time

వందే భారత్ రైళ్లల్లో ప్రయాణించేవారికి బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

Category : తెలంగాణ | Sub Category : Breaking News Posted on 2025-12-05 22:52:46


వందే భారత్ రైళ్లల్లో ప్రయాణించేవారికి బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌లో పలు మార్పులు చేసింది. కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్(ట్రై.నెం 20703/20704) ఇప్పటివరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉండేది కాదు. దానికి బదులుగా ఇప్పుడు శుక్రవారం ఆ ట్రైన్‌ను రద్దు చేశారు. ఇక సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (నెం.20707/20708) గతంలో గురువారం సర్వీసులు అందించేది కాదు. ఇప్పటి దానిని సోమవారానికి రద్దు చేస్తూ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే టైమింగ్స్,హాల్ట్‌లు, ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పులు చేయలేదు.

నిర్వహణ, సమయపాలన మెరుగుపర్చడం కోసం ఈ నాలుగు వందే భారత్ సర్వీసుల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైల్వే బోర్డు ఆమోదించిన తర్వాత షెడ్యూల్‌లో మార్పులు చేశారు. సేవా సామర్థ్యం పెండచం, నిర్వహణను క్రమబద్దీకరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రద్దు చేసిన రోజుల్లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నవారు రీఫండ్ పొందవచ్చని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అటు రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి – సాయినగర్ షిర్డీ – తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును (17425/17426) కొత్తగా తీసుకొచ్చింది. డిసెంబర్ 14 నుంచి ఈ ట్రైన్ సర్వీసులు అందించనుంది. ప్రతీ ఆదివారం ఇది అందుబాటులో ఉండనుంది. ప్రతీ ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి సాయంత్రం 4.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఇక సోమవారం ఉదయం 10.45 గంటలకు షిర్డీ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో రెండు ఏసీ బోగీలతో పాటు జనరల్ సెంకడ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.